ఆయనకున్న ప్యాన్ ఇండియా ఫాలోయింగ్ని బట్టి, ఈ సినిమాకి భారీ బడ్జెట్ వ్యత్యించారు. బాలీవుడ్ నటీనటులు, హాలీవుడ్ టెక్నీషియన్లు, భారీ విజువలైజేషన్.. ఇలా భారీ స్థాయిలో ఈ సినిమాని ముస్తాబు చేశారు. మరికొద్ది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు నెలరోజులు మాత్రమే టైం ఉంది. కానీ, ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ప్రమోషన్ మాత్రం ఆ స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రమోషన్స్లో జోరు పెంచాలి.. బ్రైట్నెస్ పెంచాలి.. అంటూ ఫ్యాన్స్ ప్రబాస్కి సూచిస్తున్నారట. ఇంతవరకూ విడుదలైన ప్రచార చిత్రాల్లోనూ పెద్దగా పస లేకుండా పోయింది. ఇలా అయితే ప్రబాస్ 'సాహో'ని నిలబెట్టడం కష్టమే అంటున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ వెనకా ముందూ ఆలోచించకుండా బడ్జెట్లో ఎక్కడా రాజీపడకుండా భారీ మొత్తం ఖర్చు పెట్టేశారు. తెలుగుతో పాటు, పలు భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆ స్థాయిలో ప్రమోషన్ ఎక్కడా.? అనేదే ప్రశ్న. ఇక రీసెంట్గా విడుదలైన 'సైకో సయ్యా..' సాంగ్ టీజర్తో ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి పోవాలంటే, మాంచి పస ఉన్న ప్రోమో ఒకటి 'సాహో' నుండి పడాల్సిందే. ఆ దిశగా చిత్రయూనిట్ కసరత్తులు చేయాల్సిందే. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శత్వంలో 'సాహో' తెరకెక్కుతోంది. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|