విభిన్న చిత్రాల్ని తెరకెక్కించడంలో నీలకంఠది ప్రత్యేకమైన శైలి. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన తనకంటూ పెద్ద సంఖ్యలో సినీ అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఆయన తాజా సినిమా ‘మాయ’ విడుదలకు సిద్ధమైంది. సహజంగానే నీలకంఠ సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యత వుంటుంది. అందుకే ‘మాయ’ సినిమా ఆడియో విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు నీలకంఠ. ఇప్పుడు సినిమా వర్గాల్లో ‘మాయ’ ఆడియో గురించి పాజిటివ్ చర్చ జరుగుతోంది. పాటలకు సంగీతాభిమానులనుంచీ మంచి స్పందనే లభిస్తోంది. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించగా, సిరాశ్రీ, రమాదేవి, బాలాజి రచన చేశారు. మంచి లిరికల్ వాల్యూస్తో వున్న పాటలు చాలా తొందరగానే సినీ సంగీత ప్రియుల మైండ్లోకి వెళ్ళిపోయాయి. ‘ఏం చేస్తు వున్నా..’, ‘పోకిరి రాజా..’, ‘ఎందుకో..’, ‘అవునన్నా కాదు అన్నా..’ పాటలతోపాటు ‘మాయ’ టైటిల్ సాంగ్స్ శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటున్నాయి. నీలకంఠ నుంచి వచ్చిన చిత్రాల్లో ఈ ‘మాయ’ కూడా గుడ్ ఆల్బమ్గా నిలిచిపోనుందని అంటున్నారు పాటలు విన్నవాళ్ళంతా.
|