ఆగస్టు 1వ తేదీన విజయవాడలో ప్రారంభం కానున్న సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ ’పి.వి.పి.స్క్వేర్’ ప్రారంభోత్సవం. ’గాడ్ ఆఫ్ క్రికెట్’ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా నిర్వహించబడనున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మాస్టర్ బ్లాస్టర్ తో బాటు, మాస్టర్ బ్యూటీ అనుష్క ఈ వేడుకకు విశిష్ట అతిథిగా విచ్చేయనున్నారని తెలుస్తోంది.
సినిమా, రాజకీయ మరియు పారిశ్రామిక రంగాల నుంచి పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకోనున్నారు. విజయవాడలో అత్యంత ఘనంగా జరగనున్న ఈ వేడుకలను పి.వి.పి. సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
|