‘దొంగాట’ సినిమా కోసం మంచు లక్ష్మి పాట పాడటం సినీ వర్గాల్లోనే కాక, ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. పాట పాడిన డిక్షన్ సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. పాట రిలీజ్ అవగానే ఇంటర్నెట్లో సంచనాలు నమోదు చేస్తోంది ఈ పాట.
‘ఏందిరోయ్..’ అని సాగే ఈ పాటను వరికుప్పల యాదగిరి రచించగా, ఇలాంటి పాటలకు మంచి ట్యూన్ అందించడంలో దిట్ట అయిన సంగీత దర్శకుడు రఘు కుంచె అత్యద్భుతంగా స్వరకల్పన గావించాడు. ‘దొంగాట’ ఓ డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో నడిచే చిత్రమట. చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా తమ ప్రయత్నాన్ని అభినందిస్తారంటోంది మంచు లక్ష్మి.
‘దొంగాట’తోపాటు మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ‘బుడుగు’ సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. ఇది ఓ థ్రిల్లర్ సినిమా. నటి మంచు లక్ష్మి తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ‘బుడుగు’ సినిమాతోనూ, ‘దొంగాట’ సినిమాతోనూ ఇంకా మంచి పేరు తెచ్చుకుంటానంటున్న మంచు లక్ష్మికి సింగర్గా ‘దొంగాట’ న్యూ ఇమేజ్ తెచ్చిందనడం నిస్సందేహం.
|