‘ఎవడు’ సినిమాలో ఓ హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ ఆ సినిమాలో బికినీ గ్లామర్ ఒలకబోసేసినా తెలుగులో ఇంకో ఛాన్స్ రాలేదామెకి. కానీ తమిళంలో అనూహ్యంగా అమీ జాక్సన్కి పాపులారిటీ పెరిగింది. ఆర్యతో స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో వచ్చిన సినిమాలో నటించిన అమీ జాక్సన్, ‘ఐ’ సినిమాతోనే అక్కడివారికి బాగా నచ్చేసింది. ఎంతలా నచ్చేసిందంటే ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ 2014 చెన్నయ్’ కిరీటాన్ని తమిళ తంబిలు ఆమెకు కట్టబెట్టేసేంతలా.మామూలుగా తమిళ ప్రేక్షకులకు బొద్దుగా ఉండే హీరోయిన్లు అంటే ఇష్టం. కానీ ఆ ఆలోచనను వారు మార్చుకునేలా చేసింది అమీ జాక్సన్ అందం. స్లిమ్ అండ్ సెక్సీగా కనిపించే అమీ జాక్సన్కి తమిళ తంబిలు పిదా అయిపోయారు. తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ‘మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆఫ్ 2014 చెన్నయ్’ కిరీటాన్ని దక్కించుకున్న సందర్భంగా అమీజాక్సన్ తన ఆనందాన్ని పంచుకుంది, తమిళ ప్రేక్షకులపై అభిమానాన్ని ప్రదర్శించింది.
|