కావలిసినపదార్ధాలు: పచ్చిమిర్చి, మెంతులు, అవాలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, నూనె
తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అది కాగాక ఆవాలు, మెంతులు వేసి అవి వేగాక పచ్చిమిర్చి, చింతపండు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి. చల్లారాకా మిక్సీలో వేసి ,ఉప్పుకూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటే ఆహా ఏమిరుచిగా వుంటుందో తెలుసా.. మీకు...! ట్రై చేసి చూడండి..
|