కొరటాల శివ దర్శకత్వంలో మహేష్బాబు, శృతిహాసన్ జంటగా నటించిన 'శ్రీమంతుడు' సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలనే కాకుండా, రాజకీయరంగం నుండి కూడా అనేక ప్రశంసలు అందుకుంటోంది. తెలుగు, తమిళ దర్శకులను అందరినీ కూడా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా హీరోయిన్ శృతిహాసన్కు ఈ సినిమా విజయం సంగతి ముందే తెలిసిపోయిందట. ఆమెకు కథ విన్నప్పుడే సినిమా భవిష్యత్తు తెలిసిపోయిందంటుంది. అందుకే డైరెక్టర్ కథ చెప్పగానే మారు మాట్లాడకుండా ఓకే చెప్పేసిందట. తను ఊహించినట్లుగానే ఈ సినిమా విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉందంటున్న శృతిహాసన్, తన కెరీర్ మొత్తానికి ఈ సినిమా ఒక మెమొరబుల్ క్యారెక్టర్ అవుతుంది అని మురిసిపోతుంది. ఈ సినిమాకి ఇంతటి విజయం సాధించి పెట్టినందుకు అభిమానులకు, చిత్ర బృందానికి ప్రత్యేకంగా ధ్యాంక్స్ చెబుతుంది శృతిహాసన్. ఈ సినిమాతో శృతిహాసన్ టాలీవుడ్కి లక్కీగాళ్గా ఫిక్సయిపోయింది.
|