వినాయక్ దర్శకత్వంలో వస్తున్న అక్కినేని అఖిల్, సాయేషా జంటగా వస్తున్న సినిమాకి నితిన్ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన సంగతి తెల్సిందే. అయితే ఇప్పుడు గ్లోబల్ ఫిలిమ్స్ అనే సంస్థతో కలిసి తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా '24' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నాడు నితిన్. 'ఇష్క్', మనం చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. విక్రమ్ కుమార్తో వున్న స్నేహమే,
ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ విడుదల చేసేందుకు కారణమయ్యిందట. తమిళ హీరో సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ కధాంశంగా ప్రేక్షకులను థ్రిల్కి గురి చేస్తుందట. ఓ పక్క 'కొరియర్ బాయ్ కళ్యాణ్' సహా ఇంకో సినిమాతో హీరోగా బిజీగా వున్న నితిన్, నిర్మాతగా బిజీ అవుతూ సరికొత్త పాత్రలో ఒదిగిపోతున్నాడు.
|