రవితేజ, రాశీ ఖన్నా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగర్'. 'ఏమైంది ఈ వేళ', 'రచ్చ' చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్ అనిపించుకున్న సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. 'బెంగాల్ టైగర్' చిత్రానికి ఈ సాంగ్ వెరీ వెరీ స్పెషల్ అట. 120 మంది డాన్సర్స్తో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు.
రవితేజ సరసన ఈ ప్రత్యేక గీతంలో 'మిర్చి' సినిమాలో స్పెషల్ సాంగ్లో చిందేసిన హంసానందిని నృత్యం చేస్తుంది. డాన్స్ మాస్టర్ హర్ష నేతృత్వంలో పాట చిత్రీకరణ జరుగుతుంది. రవితేజ ఎనర్జీకి, సంపత్ నంది టేకింగ్ తోడై, సినిమా అత్యద్భుతంగా తెరకెక్కుతోందని చిత్ర నిర్మాత అంటున్నారు. యాక్షన్ మిక్స్డ్ కామెడీతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని 'బెంగాల్ టైగర్' ఆకట్టుకుంటుందట.
|