రాంచరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'తనీ ఒరువన్' రీమేక్ సినిమాకు ఏర్పాట్లు వేగవంతం అవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలు పేర్లు పరిశీలించి, ఎట్టకేలకు శృతిహాసన్ను ఎంపిక చేశారు. 'ఎవడు' సినిమాతో జతకట్టిన శృతిహాసన్ రెండో సారి ఈ సినిమాలో చెర్రీతో జతకట్టబోతోంది. ఇకపోతే విలన్ విషయంలో మొదట్లో తమిళ సినిమాలో విలన్గా నటించిన అరవింద్ స్వామినే తెలుగులో కూడా తీసుకుందామనుకున్నారు. కానీ కొన్ని కారణాలతో వేరే ఆప్షన్కి షిఫ్ట్ అవుతున్నారు. విలన్ వెతుకులాట కొనసాగిస్తున్నారట. బహుశా టాలీవుడ్ నుంచే కొత్త లుక్ ఉన్న విలన్ను ఎంచుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఓ ప్రముఖ నటుడ్ని ఇప్పటికే ఈ క్యారెక్టర్ కోసం సంప్రదించారని వినికిడి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమా సంక్రాంతికి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నుండి షూటింగ్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేసే యోచనలో ఉంది చిత్ర యూనిట్. తమిళ 'తని ఒరువున్'కి కొన్ని మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా, కమర్షియల్ హంగులతో రూపొందించనున్నారు ఈ చిత్రాన్ని. చిరంజీవి దగ్గరుండి ఆ మార్పుల్ని సూచించగా, వాటికి పదును పెడ్తున్నాడట దర్శకుడు సురేందర్రెడ్డి.
|