స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోన్న సమయంలోనే ఐటెం సాంగ్లో నర్తించింది మిల్కీ బ్యూటీ తమన్నా. బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అల్లుడు శీను' లో తొలిసారిగా తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించింది. నా ఒంటి పేరు మిల్కు, నా ఇంటి పేరు సిల్కు' అంటూ తన అందాలతో చిందేసింది. ఇప్పుడు అదే హీరోతో మళ్లీ ఐటెం సాంగ్లో చిందేస్తానటోంది. ఈ మిల్కీ భామ చేసిన రెండు ప్రత్యేక గీతాలు ఒకే హీరో కోసం చెయ్యడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న రెండో చిత్రం 'స్పీడున్నోడు'. ఈ సినిమాలో హీరోయిన్గా సోనారిక నటిస్తోంది. భీమినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో నటిస్తోంది.
ఈ సినిమాకు ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ కానుందట. బ్యాచిలర్స్ పార్టీ సందర్భంగా సాగే ఈ పాటలో తమన్నా తన అందచందాలతో ఆకట్టుకుంటుందట. ప్రస్తుతం హీరోయిన్గానూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇలా ఐటెం సాంగ్స్లో కూడా నటించడం గొప్ప విషయమే. నాగార్జున, కార్తి కాంబినేషన్లో వస్తున్న 'ఊపిరి' సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది తమన్నా. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క 'బాహుబలి-2' షూటింగ్ కూడా జరుగుతోంది. దీనిలో అవంతికా రాజకుమారి పాత్రలో కనిపించనుంది.
|