'అందాల రాక్షసి' ఫేం లావణ్య త్రిపాటి తాజా చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. టాలీవుడ్ నెంబర్వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర అసిస్టెంట్గా పని చేసిన అనుభవంతో జగదీష్ తలశిల ఈ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కించారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, 'లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. 'అందాల రాక్షసి' తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మరో చిత్రమిది. ఈ సినిమాలో లావణ్య మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించింది. కామెడీ, ధ్రిల్లింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సంక్రాంతికి లావణ్య నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇదే నెలలో లావణ్య నటిస్తున్న మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడం డబుల్ ధమాకానే. ఇప్పటిదాకా తాను నటించిన నటించిన సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కూడిన పాత్రలతో అలరిస్తున్న లావణ్య, 'లచ్చిందేవికీ ఓ లెక్కుంది' సినిమాలో ఇంకా డిఫరెంట్గా కనిపిస్తుందట. సినిమా మొత్తం చీరల్లో అందంగా నిండుగా కనిపిస్తుంది లావణ్య. 'సోగ్గాడే..' చిత్రం గురించి మాట్లాడుతూ, స్టార్ హీరో నాగార్జునతో నటించడం తన కెరీర్లో గొప్ప అచ్చీవ్మెంట్ అంటోంది ఈ భామ. ప్రస్తుతం అమ్మడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.
|