సంక్రాంతికి ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విడుదలైన సినిమాలు మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150', బాలకృష్ణ నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు. వీటిలో 77 కోట్లు వసూలు చేసింది 'గౌతమి పుత్ర శాతకర్ణి'. 100 కోట్లు దాటేసింది 'ఖైదీ నెంబర్ 150'. ఈ రెండు సినిమాలూ ఒక్క రోజు తేడాతో విడుదలయ్యాయి. ఈ సంక్రాంతికి అభిమానుల్ని అత్యంత అద్భుతంగా అలరించాయి ఈ రెండు సినిమాలు. సగటు సినీ అభిమాని ఈ రెండు చిత్రాలతోపాటుగా, మరో సినిమా 'శతమానం భవతి'ని కూడా ఆదరించాడు. తెలుగు సినిమా ఈ సంక్రాంతికి అద్భుతమైన వసూళ్ళను సాధించింది.
'శాతకర్ణి', 'ఖైదీ' సినిమాలు 50 రోజుల పండగని కూడా పూర్తి చేసుకున్నాయి. నైజాం, సీడెడ్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా ఈ రెండు చిత్రాలకూ మంచి వసూళ్ళు రాగా, చిన్న సినిమా అయినా తాను కూడా బాగానే వెనకేసుకున్నానని 'శతమానంభవతి' నిరూపించింది. 100వ చిత్రంతో బాలకృష్ణ మరపురాని విజయాన్ని అందుకోగా, 9 ఏళ్ళ తర్వాత హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి 150వ సినిమాతో అత్యద్భుత విజయాన్ని కైవసం చేసుకున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాలు వసూళ్ల పరంగా సంక్రాంతికి కాసుల వర్షం కురిపించాయనే చెప్పాలి. చాలా కాలం తర్వాత ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ కలకలలాడిపోయింది. అందుకే ఈ రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తోంది.
|