జక్కన్న రాజమౌళి రూపొందిస్తున్న 'బాహుబలి-2' (బాహుబలి ది కంక్లూజన్) సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా కన్నా ముందుగా ట్రైలర్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేయనుందట. ఈ విషయాన్ని ట్రైలర్ని ముందే చూసేసిన కీరవాణి సోదరుడు కళ్యాణి మాలిక్ చెబుతున్నాడు. ట్రైలర్ చూశాక తన నోట మాట రాలేదనీ, సినిమా తరహాలో ట్రైలర్ కూడా వంద రోజులు ఆడే సినిమాలా ఉందని అన్నారాయన. 'బాహుబలి ది బిగినింగ్' సినిమాకి కూడా ట్రైలర్తో దేశం దృష్టిని ఆకర్షించాడు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రభాస్, రాణా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి తమన్నా, అనుష్క తదితరులు ఇతర ప్రధాన ఆకర్షణ. సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రల్లో కన్పించి మెప్పించారు.
సినిమా ఒక్కటే అయినా దాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించిన దర్శకుడు, తొలి భాగంతో ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని విధంగా మన్ననలు పొందాడు. అతి త్వరలో రానున్న రెండో భాగానికి ముందు కూడా ట్రైలర్తోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించే పనిలో ఉన్నాడన్నమాట. హీరో ప్రభాస్ కేవలం ఈ సినిమా కోసమే మధ్యలో ఇంకే సినిమా చేయకుండా పూర్తిగా డెడికేట్ అయి ఉన్నాడంటే ఈ సినిమాని ఆయనెంతగా నమ్మాడో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాన్ను ట్రైలర్, ఆ తర్వాత ప్రేక్షకుల్ని పలకరించనున్న సినిమా టాలీవుడ్ ఖ్యాతిని ఇంకోసారి ప్రపంచ వ్యాపితం చెయ్యాలని ఆశిద్దాం.
|