'బాహుబలి' సినిమా తర్వాత వస్తోన్న పెద్ద సినిమా 'డీజె - దువ్వాడ జగన్నాధమ్'. ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. 100 కోట్ల దిశగా బన్నీ ప్రయాణం సాగనుందని ఈ సినిమాతో అంచనాలు వేస్తున్నారు ట్రేడ్ పండితులు. భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇంతవరకూ రెండు పాటలు ఆడియో సింగిల్స్గా విడుదలయ్యాయి. రెండు పాటలు ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. పూజా హెగ్దే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో అమ్మడి అందాలను చాలా గ్లామరస్గా చూపించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కాగా పూజా, బన్నీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కవుటయ్యిందని అంటున్నారు
ఈ సినిమా పోస్టర్స్ చూసి. తమకం, చమకం అంటూ సాగే పాట వివాదాస్పదమయినప్పటికీ చిత్ర యూనిట్ ఇన్ టైంలో స్పందించడంతో ఆ పాటలోని అభ్యంతరకర పదాలను తొలగించడం ద్వారా వివాదం సద్దుమణిగింది. జూన్ 23న ఈ సినిమా భారీగా విడుదల కానుంది. బన్నీకి మలయాళంలో చాలా పాపులారిటీ ఉంది. ఆ కారణంగా ఈ సినిమా వసూళ్లలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. మరో పక్క వరుస విజయాలు బన్నీకి చుట్టూ వైఫైలా ఉన్న కారణంగా ఈ సినిమాతో మరో విజయం పక్కా అంటున్నారు. 'బాహుబలి' సినిమా తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకుల ఈ సినిమా కోసం చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నార.
|