స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ని తెరకెక్కించేందుకు టాలీవుడ్లో రంగం సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ని తెరకెక్కించేందుకు ఇద్దరు డైరెక్టర్లు నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. సంచలన డైరెక్టర్ వర్మ ఒకవైపైతే, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఆల్రెడీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఫామ్లోకి వచ్చిన డైరెక్టర్ తేజ ఇంకోవైపు. అయితే వర్మ తెరకెక్కించే బయోపిక్ లక్ష్మీ పార్వతి యాంగిల్ నుండి వుంటుందన్న విషయం వర్మ తేల్చేశారు. ఆల్రెడీ ఆయన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' టైటిల్తో ఓ ఫస్ట్లుక్ని కూడా రిలీజ్ చేశారు. లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ లైఫ్లోకి ఎంటర్ అయిన దగ్గర్నుంచీ, ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు, పొలిటికల్గా వచ్చిన పరిణామాల దృష్ట్యా తన సినిమా ఉంటుందనీ వర్మ స్పష్టం చేశారు.
అయితే తేజ డైరెక్షన్లో తెరకెక్కబోయే బయోపిక్ ఎలా ఉండబోతోందన్నదే ప్రస్తుతానికి సస్పెన్స్. వర్మ బయోపిక్లో నటించే నటీనటుల సంగతి ఇంకా తెలీదు కానీ, తేజ బయోపిక్లో నటించేది మాత్రం బాలయ్య బాబే. బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించనున్నారు. తేజ డైరెక్షన్లో తెరకెక్కే బయోపిక్ అయితే ఎన్టీఆర్ నట జీవితం, పొలిటికల్ జీవితం ఇలా ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్ విషయంలో ఓ స్పెషల్ టీమ్ బ్యాక్ గ్రౌండ్ వర్క్ మొదలెట్టేసింది. ఎన్టీఆర్ జీవిత గాథకి సంబంధించి ముఖ్యమైన అంశాల్ని ఓ స్క్రిప్టుగా తయారు చేసే పనిలో ఉంది ఈ స్పెషల్ టీమ్. వర్మ - 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ అయ్యి, అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ - బాలయ్య బయోపిక్ జనవరిలో సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ సినిమాకి బాలయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారనీ సమాచారమ్.
|