మెగాస్టార్ చిరంజీవి ఇంతకు ముందెన్నడూ లేని కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. బహిరంగ సమావేశాల్లో చాలా జోష్గా పాల్గొంటున్నారు. చాలా చాలా సరదా సరదాగా ఉల్లాసంగా ఆకట్టుకుంటున్నారు చిరంజీవి. దీనికంతటికీ కారణం 'సైరా నరసింహారెడ్డి' సినిమానేనట. ఈ సినిమా చిరంజీవిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందట. చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతోంది 'సైరా'. ఈ సినిమా చిరుకి అత్యంత ప్రతిష్ఠాత్మకం. అసలు ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో అనే రూమర్స్ మధ్యన సినిమా సెట్స్ మీదికెళ్లింది. వెళ్లడమేనా అప్పుడే తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఔట్పుట్ చాలా బాగా వచ్చిందట. ఈ ఉత్సాహమే చిరంజీవిలో కనిపిస్తోంది.
భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న చిత్రమిది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి, సినిమాని యూనివర్సల్గా విడుదల చేసే యోచనలో నిర్మాత రామ్ చరణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథనందించారు. ఇక సినిమా విషయానికి వస్తే, యాక్షన్ ఘట్టాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది ఈ సినిమాలో. అందుకు సంబంధించి భారీ స్థాయిలో సెట్స్ని సిద్ధం చేస్తున్నారు. భారీ సెట్స్ కారణంగానే ఈ సినిమా పట్టాలెక్కేందుకు ఇంత ఆలస్యమైందనీ సమాచారమ్. ఎట్టకేలకు 'సైరా' పట్టాలెక్కేసింది. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న జోరు చూస్తుంటే, సినిమాని అనుకున్న టైంకే కంప్లీట్ చేయగలరనిపిస్తోంది. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా, ముద్దుగుమ్మ నయనతార హీరోయిన్గా నటిస్తోంది.
|