కావలిసిన పదార్ధాలు: గోంగూర, పచ్చి రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నూనె, పసుపు, కారం, ఉప్పు, అల్లంవెల్లుల్లిముద్ద
తయారుచేసే విధానం: ముందుగా గోంగూరని శుభ్రం గా కడిగి నూనె వేసి బాగా మగ్గనివ్వాలి.. తరువాత వేరుగా ఇంకో బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తరువాత కడిగిన రొయ్యలను కూడ వేసి కలిపి ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పదినిముషాలు మూత పెట్టి ఉడికించాలి. తరువాత ముందే తయారుచేసిన గోంగూర మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడకించాలి. అంతేనండీ.. పచ్చి రొయ్యలు రెడీ...
|