అక్కినేని నాగేశ్వరరావు పరమపదించారన్న విషయం ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. సినీ పరిశ్రమకి పెద్ద దిక్కుగా వెలిగిన అక్కినేని లేని లోటు పూడ్చలేనిది. ఆయన నటించిన ఆఖరి చిత్రం కోసం సినీ పరిశ్రమ, ప్రేక్షక లోకం ఎదురు చూస్తున్నది. దాంతో ‘మనం’ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
నాగేశ్వరరావు, ఆయన కుమారుడు నాగార్జున, నాగార్జున తనయుడు నాగచైతన్య ఈ ‘మనం’ సినిమాలో నటించారు. అక్కినేని చివరి రోజుల్లోనూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా సినిమా పట్ల తనకున్న కమిట్మెంట్ని చాటుకున్నారు. ఓ పాటలో ఆయన నటించాల్సి వున్నా ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ పాటను చిత్రీకరించలేకపోయూరు.
సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయాలని నాగార్జున సన్నాహాలు చేస్తున్నారట. ‘మనం’ సినిమా ఫస్ట్ లుక్ గతంలో విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టుకుంది. ఆ పోస్టర్లో అక్కినేని చిన్న పిల్లాడి డ్రస్ వేసుకుంటే, నాగచైతన్య తాత గెటప్లో పంచె కట్టుతో కనిపించాడు. నాగ్ మాత్రం మిడిల్ ఏజ్డ్ లుక్ ఇచ్చాడు. అది అభిమానులను అలరించింది. సినిమా అభిమానుల్ని ఇంకా అలరించనుంది.
|