కమర్షియల్ ఫార్మాట్ వైపు ఆసక్తి చూపకుండా, తాను నమ్మిన ‘విభిన్నతను’ నమ్ముకుని సినిమాలు తీయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు విభిన్న చిత్రాల దర్శకుడు నీలకంఠ. ‘మిస్సమ్మ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న నీలకంఠ, ఆ తర్వాత చాలా సినిమాలు తీసినప్పటికీ, అవి ఓ వర్గం ప్రేక్షకుల్ని మాత్రమే మెప్పించాయి.
అయితే నీలకంఠ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనే విషయం అటుంచి, ఆయన సినిమా ఎప్పుడొచ్చినా, దానిపై సినీ పరిశ్రమలోనూ, ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొంటుంది. ఓ దర్శకుడికి ఇంతకన్నా కావాల్సిందేముంది? ఎప్పుడూ కొత్తదనంతో కూడిన సినిమాలపైనే దృష్టిపెట్టే నీలకంఠ ‘మాయ’ సినిమాని కూడా ఆ కోవలోనే తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా పనుల్లోనే వున్నారాయన.
‘మాయ’ సినిమా ఆడియో విడుదల వేడుక ఈ నెల 22న జరగనుంది. మధుర శ్రీధర్, ఎంవీకే రెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి. సినిమాపై విడుదలకు ముందే సినీ పరిశ్రమలో సినిమాపై ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి. నీలకంఠ గత చిత్రాలన్నీ ఆడియో పరంగా ఆకట్టుకున్నవే. ఆ కోవలోనే ఈ సినిమా ఆడియోకి కూడా ప్రీ రిలీజ్ మంచి టాక్ విన్పిస్తోంది.
|