తెలుగు సినీ పరిశ్రమ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ‘బాహుబలి’. తెలుగు సినిమా పరిశ్రమలోనే కాకుండా, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ పరిశ్రమల్లోని ప్రముఖులూ ‘బాహుబలి’ రిలీజ్ కోసం చాలా ఇంట్రెస్ట్తో ఎదురుచూస్తున్నారు. కెరీర్లో సంచలన విజయాలు తప్ప ఓటమి ఎరుగని రాజమౌళి సృష్టించనున్న మరో అద్భుతం కావడంతో ‘బాహుబలి’ ప్రేక్షకుల్లో రేపుతున్న ఆసక్తి అంతా ఇంతా కాదు.
రెండేళ్ళుగా సినిమా నిర్మానం జరుపుకుంటున్న ‘బాహుబలి’కి సంబంధించి ఓ సూపర్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే, సినిమా టాకీ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయిందట. జస్ట్ వన్ వీక్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారమ్. రెండు పాటలు ఇంకా చిత్రీకరించవలసి ఉంది. మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని ‘బాహుబలి’ సమ్మర్కి ప్రేక్షకుల ముందుకు వస్తాడట.
ప్రభాస్, అనుష్క, రాణా, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘బాహుబలి’ ఇండియన్ సినిమా స్క్రీన్పై ‘గ్లాడియేటర్’ తరహా సినిమా అవుతుందనే అంచనాలున్నాయి. బాలీవుడ్ హీరో అమీర్ఖాన్ కూడా ఈ సినిమా విడుదల పట్ల ఆసక్తితో ఉన్నట్లు వెల్లడిరచాడు. సమ్మర్ హీట్లో, ‘బాహుబలి’ ఫీవర్తో ఆడియన్స్ ఎంజాయ్ చెయ్యడమే మిగిలి ఉంది.
|