నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (నాట్స్) వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అమెరికాలోని డల్లాస్లో నాట్స్ నిర్వాహకులు సినీ గేయ రచయితలతో ‘మా బాణి.. మీ వాణి’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ గేయ రచయితలు రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, నవతరం గేయ రచయితలు చంద్రబోస్, సిరాశ్రీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్వాహకులు ఇచ్చిన బాణీలకు, గేయ రచయితలు పాటలు రాశారు. కార్యక్రమం అంతా చాలా సరదాగా సాగింది. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ ఎన్నారైలు కరతాళ ధ్వనులతో గేయ రచయితలను అభినందించారు. కొత్త తరహాలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఓ సాహితీ విన్యాసంలా సాగింది.
వినూత్నంగా ‘మా బాణి.. మీ వాణి’ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిర్వహిస్తే, నాట్స్ సంబరాలకు వెళ్ళిన గేయ రచయితలు, ఈ కార్యక్రమానికి కొత్త శోభ తీసుకొచ్చారు.
|