'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే నటిగా వందకు వంద మార్కులు వేయించేసుకున్న ఈ భామ 'మహానటి' సినిమాతో నటిగా హైలెవల్కి చేరుకుంది. ఆ తర్వాత కీర్తి సురేష్ తమిళంలో బాగా బిజీ అయిపోయింది. అక్కడ విజయ్, విక్రమ్, విశాల్ ఇలా స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ దక్కించుకుంది. తెలుగులో 'మహానటి' తర్వాత ఆ స్థాయి చిత్రం కోసం ఎదురు చూసింది. దాంతో మరే సినిమాకీ సైన్ చేయలేదు. తాజాగా తెలుగులో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి కీర్తి సైన్ చేసింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కీర్తి ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
లేడీస్కి సంబంధించి బలమైన సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఇకపోతే లేటెస్టుగా కీర్తిసురేష్ సూపర్ స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకుందంటూ ఓ వార్త జోరుగా ప్రచారంలో ఉంది. అయితే ఈ సూపర్స్టార్ తెలుగు సూపర్స్టార్ మహేష్బాబు అయితే కాదు. తమిళ సూపర్స్టార్ రజనీకాంత్. 'పేట' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సూపర్స్టార్ రజనీ తదుపరి మురగదాస్ దర్శకత్వంలో సినిమా ఓకే చేశారట. ఆ సినిమాలో హీరోయిన్గా కీర్తిని పరిశీలిస్తున్నారనీ కోలీవుడ్ వర్గాల సమాచారమ్. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తెలుగులో 'ఆర్ఆర్ఆర్' మల్టీ స్టారర్లోనూ కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉంది.
|