తమిళంలో పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్గా మెరిసిన ముద్దుగుమ్మ వరలక్ష్మి శరత్కుమార్. తర్వాత కొంచెం బొద్దుగా మారడంతో, హీరోయిన్ పాత్రలకు టాటా బైబై చెప్పేసి, విలన్ అవతారమెత్తేసింది. హీరోకి ధీటైన లేడీ విలన్ పాత్రల్లో రాణిస్తోంది. ఇప్పటికే స్టార్ హీరోలు విజయ్, విశాల్, ధనుష్లకు విలన్గా 'ఢీ' అంటే ఢీ అంటూ నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ సత్తా చాటనుంది. ఆల్రెడీ ఆయా సినిమాల డబ్బింగ్ వెర్షన్లో తెలుగు ప్రేక్షకులు వరలక్ష్మి శరత్కుమార్ టాలెంట్కి ఫిదా అయిపోయారు. ఆడియన్స్నే కాదు, మన దర్శక, నిర్మాతల్ని కూడా మెస్మరైజ్ చేసిన వరలక్ష్మి త్వరలోనే తెలుగులో స్ట్రెయిట్ మూవీస్తో సందడి చేయనుంది.
ఇప్పటికే రెండు, మూడు ప్రాజెక్టులు సైన్ చేసిందట. వాటిలో మాస్ రాజా రవితేజ సినిమా ఒకటి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీలో వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్ర పోషించనుంది. రవితేజ - వరలక్ష్మి కాంబినేషన్లో వచ్చే సీన్స్ని చాలా చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారట. ఠాగూర్ మధు ఈ సినిమాకి నిర్మాత. అందాల భామ శృతిహాసన్ ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. అన్నట్లు యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన 'తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్' సినిమాలో వరలక్ష్మి కీలక పాత్ర పోషించింది.
|