గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాదితో కొండాపూర్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ ఈరోజు ఉదయం కన్నుమూసారు. సంక్రాంతి పండుగకు తన సొంతవూరు భీమవరం వెళ్ళిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఈనెల 20న మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. వయస్సు 63 సంవత్సరములు. ఎమ్మెస్ కు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు.
700ల చిత్రాలకి పైగా నటించిన ఎమ్మెస్ నారాయణ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో దూకుడు చిత్రానికి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు, మరియు మా నాన్నకు పెళ్లి, రామసక్కనోడు, సర్దుకుపోదాం రండి, శివమణి, దూకుడు చిత్రాలకు 5 నంది అవార్డులు అందుకున్నారు.
గోతెలుగు.కామ్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది.
|