నటన అన్నది ముఖ్యం. ప్రేక్షకుల్ని అలరించడం ఇంకా ముఖ్యం అంటుంది ‘ఐతే’ సినిమాతో హీరోయిన్గా మారిన సింధు తులానీ. తొలి సినిమాతో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. రెండో సినిమా ‘అతనొక్కడే’ కమర్షియల్ విజయం కూడా అందించింది. తెలుగు, తమిళ సినిమాల్లో నటించి, ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలకే పరిమితమైన సింధు తులానీ, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో హీరోకి వదిన పాత్రలో నటించి మెప్పించింది.
అంతకు ముందు ఆది హీరోగా వచ్చిన ‘ప్రేమకావాలి’ సినిమాలో కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించింది. ‘బతుకమ్మ’ సింధు తులానీ కెరీర్లో మరో ముఖ్యమైన సినిమా. గ్లామరస్ తారగా ఆదరించిన ప్రేక్షకులు, అక్క వదిన పాత్రల్లో కూడా తనను ఆదరిస్తుండడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది సింధు తులానీ. ప్రస్తుతం నటనలో బిజీగా ఉన్నాననీ, హీరోయిన్గా కూడా అవకాశాలొస్తున్నప్పటికీ, మంచి కథ, కథనంతో కూడా సినిమాలనే ఒప్పుకుంటున్నాననీ, సినిమాల్లో తన పాత్ర తక్కువా? ఎక్కువా? అని ఎప్పుడూ ఆలోచించలేదని అంటుంది ఈ ‘ఐతే’ భామ.
|