శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్' సినిమా అందర్నీ ఆలోచింపజేసేలా రూపొందింది. హీరో రాణా తొలి సినిమా అది. రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ ఈ సినిమాలో హీరోయిన్లు. ప్రస్తుత రాజకీయాల్లోని స్థితిగతుల్ని దర్శకుడు 'లీడర్' సినిమాలో చక్కగా ప్రెజెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'లీడర్ 2' చేయాలనే ఆలోచనతో ఉన్నాడు రాణా. ఈ విషయాన్నే రాణా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. కథా చర్చలు జరుగుతున్నాయట కూడా. తొలి సినిమాకీ ఇప్పటికీ రాణాలో నటుడిగా ఎంతో పరిణతి వచ్చింది. అలాగే అతని స్టార్డమ్ కూడా పెరిగింది. ఈ టైమ్లో రాణా 'లీడర్ 2' చేస్తే, నేటి రాజకీయాలను ప్రతిబింబించేలా సినిమా తీయగలిగితే, రాణా కెరీర్లోనే బెస్ట్ ఫిలింగా 'లీడర్ 2' కీర్తింపబడవచ్చు. దర్శకుడు ఎవరన్నది ఇంకా రాణా చెప్పలేదు. శేఖర్ కమ్ముల లేదా క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఉందేమో.
|