అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'మయూరి'. నయనతార హీరోయిన్గా రూపొందిన ఈ సినిమాని సి.కళ్యాణ్ తెలుగులో విడుదల చేశారు. వినాయక చవితి సందర్భంగా విడుదలయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య వచ్చిన అనేక హారర్ కామెడీ చిత్రాలకు భిన్నంగా పూర్తిస్థాయి హర్రర్ సినిమా అనిపించుకుంటోంది 'మయూరి'. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటూ నిర్మాతకి కాసుల పంట పండించే దిశగా దూసుకుపోతోంది.
ఇంతవరకూ గ్లామర్ పాత్రలతో అలరించిన నయనతార ఈ సినిమాలో తన నటనలోని మరో కోణాన్ని వెలికి తీసి, జనాన్ని బాగా భయపెట్టింది. ధియేటర్లో సినిమా చూస్తున్న ప్రక్షకులు థ్రిల్లింగ్తో కూడిన భయానక సన్నివేశాలకు ఎంతటి ధైర్యవంతులైనా భయపడి తీరాల్సిందేనట. అంత గొప్పగా ఈ సినిమాకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ హారర్ సన్నివేశాలు ఉన్నాయి మరి. అందుకే చిత్ర బృందం ఈ సినిమాను భయపడకుండా ఎవరైనా చూస్తే వారికి ఐదు లక్ష రూపాయల ప్రైజ్ మనీని బహూకరిస్తామని సవాల్ కూడా విసిరేశారు.
|