శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మూెత్సవం'. ఈ సినిమా షూటింగ్ బుధవారం హైద్రాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యింది. పెరల్. వి పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి ఈ సినిమాన్ని నిర్మిస్తున్నారు. ఒక ట్రెడిషనల్ సాంగ్తో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కావడం ఒక విశేషమైతే, ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి ఆధ్యర్యంలో 513 మంది యూనిట్ కలిసి తయారు చేసిన ఒక భారీ సెట్లో ఈ పాట చిత్రీకరణ జరగడం మరో విశేషం.
ఇలాంటి ట్రెడిషనల్ సాంగ్స్ను చిత్రీకరించడంలో శ్రీకాంత్ అడ్డాల మరోసారి తన క్రెడిట్ను చూపించుకోబోతున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్స్గా నటిస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మరో మంచి ఫ్యామిలీ చిత్రాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు చిత్ర దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.
|