'కంచె' సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న క్రిష్, తన తదుపరి చిత్రంగా మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి హీరోగా నటించబోయే సినిమాకి చాలామంది డైరెక్టర్స్ క్యూలో వున్నారు. వారిలో మొదటి ఛాన్స్ పూరి జగన్నాథ్కి దక్కింది. ఈలోగా శ్రీనువైట్ల, తన 'బ్రూస్లీ' సినిమాలో చిరంజీవితో అతిథి పాత్రలో నటింపజేస్తున్నాడు. పూరి జగన్నాథ్ తర్వాత చిరంజీవి, క్రిష్ డైరెక్షన్లో సినిమా చేసే అవకాశం ఉందట. క్రిష్ చిరంజీవి కోసం కొంతకాలం క్రితమే ఓ కథ రెడీ చేసుకున్నాడట. దాన్ని చిరంజీవికి క్రిష్ చెప్పడం, చిరంజీవి కూడా క్రిష్ కథ చెప్పిన తీరుకి ఇంప్రెస్ అవడం జరిగాయంటున్నారు.
ఇది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కావచ్చని గాసిప్స్ విన్పిస్తున్నాయి. 'బ్రూస్లీ' సినిమా తర్వాత చిరంజీవి, పూరి జగన్నాథ్తో సినిమా చేస్తాడనీ, ఆ తర్వాతే క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కబోయే సినిమాలో చిరంజీవి నటిస్తారనీ సమాచారమ్. ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కన్పించనున్నట్లు కూడా ఇండస్ట్రీలో గుసగుసలు విన్పిస్తున్నాయి.
|