నయనతార హీరోయిన్గా వచ్చిన సినిమా 'మయూరి'. ఈ సినిమాతో నయనతార గొప్ప విజయాన్ని అందుకుంది. హారర్, థ్రిల్లింగ్ కథాంశంగా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుండి పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద జోరుగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా అక్కడా, ఇక్కడా కూడా పెద్ద హిట్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో వస్తున్న సినిమా 'త్రిపుర'. కొత్తగా పెళ్లయిన ఒక పల్లెటూరి అమ్మాయి జీవితంలో చోటు చేసుకున్న అనూ హ్య సంఘటనలను హారర్, ధ్రిల్లింగ్ నేపధ్యంలో డైరెక్టర్ గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా కూడా తెలుగులోనూ, తమిళంలోనూ ఒకేసారి విడుదల కానుంది.
మయూరి'తో నయనతారకు మంచి పేరు వచ్చినట్లుగానే 'త్రిపుర' సినిమాతో కలర్స్ స్వాతికి కూడా మంచి పేరు లభిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమిళంలో ఇప్పటికే మంచి నటిగా పేరు తెచ్చుకున్న స్వాతి ఈ సినిమాతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. త్వరలోనే భయపెట్టడానికి మన ముందుకొస్తోంది స్వాతి నటించిన 'త్రిపుర' సినిమా.
|