సిద్దు జొన్నలగడ్డ, రష్మి గౌతమ్, శ్రద్దాదాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'గుంటూర్ టాకీస్' సినిమాకు విడుదల డేట్ ఫిక్సయ్యింది. మార్చి నెల 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విలక్షణ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. చిన్న సినిమాల్లో మంచి సినిమా, పెద్ద సినిమా అవుతుందని చిత్ర యూనిట్ ఆశా భావం వ్యక్తం చేస్తోంది. బుల్లితెర యాంకర్గా మంచి పేరు తెచ్చుకున్న రేష్మికి ఈ సినిమా వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా విషయంలో పబ్లిసిటీ బాగా జరుగుతోంది. పల్లెటూరి అమ్మాయి గెటప్లో రేష్మీ నటన ఆకట్టుకునే విధంగా ఉంటుందట. వెండితెరకు పరిచయమై చాలా కాలమే అయినప్పటికీ రేష్మికి ఇంతవరకూ సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని రేష్మి అంటోంది. ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుందీ చిత్రంలో. 'చందమామ కథలు' అనే ఒక విభిన్నమైన కథను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావడం, 'జబర్దస్త్' యాంకర్ రష్మి హీరోయిన్గా నటిస్తుండడం ఇవన్నీ సినిమాపట్ల ఎట్రాక్షన్ని పెంచుతున్నాయి.
|