యువ హీరో సందీప్ కిషన్ 'రన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నాడు. తమిళ సినిమా 'నేరమ్'కి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ భామకి 'సర్దార్ గబ్బర్సింగ్'తో బంపర్ బ్రేక్ దక్కాల్సింది. తృటిలో ఆ అవకాశం ఆమెకు దూరమయ్యింది. 'రన్' సినిమా దగ్గరకొస్తే, ఇందులో ఆమెకు మంచి పాత్ర దక్కిందట. హీరో, హీరోయిన్ ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు. తెలుగు ప్రేక్షకులకు 'రన్' మంచి అనుభూతినిస్తుందని చిత్ర దర్శకుడు చెప్పారు.
'టైమ్' మీద ఆధారపడి ఈ చిత్ర కథాంశం ఉంటుందనీ, ప్రతి సీన్ ప్రేక్షకులకు కొత్త కొత్తగా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు వివరించారు. మార్చ్ 23న 'రన్' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' సినిమాతో ఎక్స్ప్రెస్లా దూసుకొచ్చిన యంగ్ హీరో సందీప్ కిషన్, 'రన్' సినిమాతో తన కెరీర్ సూపర్ ఫాస్ట్ అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మలయాళంలో 'నేరం' ఘనవిజయం సాధించిందనీ, తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా 'నేరమ్'కి మార్పులు చేసి, 'రన్' పేరుతో తెలుగులోకి రీమేక్ చేస్తున్నామనీ, సినిమా ఘనవిజయం సాధించి తమకు మంచి పేరు తెస్తుందని హీరో సందీప్ కిషన్, హీరోయిన్ అనీషా ఆంబ్రోస్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ టు 'రన్' టీమ్.
|