'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయం అయ్యింది లక్ష్మీ రాయ్. కానీ ఆ తరువాత ఈ ముద్దుగుమ్మకి తెలుగులో అవకాశాలు అంతగా దక్కలేదు. దాంతో రాయ్ లక్ష్మిగా పేరు మార్చుకుంది. తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన 'కాంచన' సినిమాతో విజయం అందుకుంది. అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. కానీ అక్కడ కూడా ఆమెను మంచి అవకాశాలు తట్టలేదు. అప్పుడెప్పుడో తమిళంలోనే ఐటెం గాళ్గా నటించమని ఒక దర్శకుడు అడిగితే ఈజీగా నో చెప్పేసిందట. దాంతో అక్కడ ఆ అవకాశాలు కూడా తప్పిపోయాయి. తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఐటెం గాళ్గా మెరిసింది. 'తోబా తోబా..' అంటూ సాగే ఆ పాటలో జోరుగా స్టెప్పులేసింది. పాట కూడా బాగా పాపులర్ అయ్యింది.
దాంతో ఆమెని ఐటెం సాంగ్స్ వెతుక్కుంటూ వస్తున్నాయట. ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలోఈ ముద్దుగుమ్మ సరే అనక తప్పడం లేదంటోంది. తమిళంలో లారెన్స్ హీరోగా తెరకెక్కుతోన్న 'మొట్టశివ కెట్టశివ' అనే సినిమాలో ఈ వైట్ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఉందట. లారెన్స్తో చేసిన 'కాంచన' సినిమాతోనే లక్ష్మీ రాయ్ దశ తిరిగింది. ఆ సెంటిమెంట్తోనే లారెన్స్ మళ్ళీ లక్ష్మీరాయ్కి అవకాశం ఇచ్చాడట. ఈ సాంగ్తో తమిళంలో కూడా ఐటెం గాళ్గా ఫిక్స్ అయిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది రాయ్ లక్ష్మి.
|