చిరంజీవి సినిమా 'ఖైదీ నెంబర్ 150' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీ అయిపోయింది. ఆడియో ఫంక్షన్ వేడుక జరగలేదు. కానీ ఆడియో సింగిల్స్తో సోషల్ మీడియాలో హల్ చల్ స్టార్ట్ అయ్యింది. ఒక్కొక్కటిగా సాంగ్స్ విడుదల చేశారు. మాస్ని ఎట్రాక్ట్ చేసేలా, ఫీల్ గుడ్ రొమాంటిక్ మూడ్ని క్రియేట్ చేసేలా ఉన్నాయి ఈ సాంగ్స్. ఇప్పటికి మూడు పాటలు మార్కెట్లోకి వచ్చాయి. 'అమ్మడూ కుమ్ముడూ..', సుందరి.., 'సాయంకాలాన సాగరతీరాన..' అంటూ మూడు పాటలు వచ్చాయి. మూడు పాటలు ఓ రేంజ్లో హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఆడియోతో పాటు వచ్చిన మెగాస్టార్ స్టిల్స్ దుమ్ము రేపుతున్నాయి.
ఇక న్యూ ఇయర్కి బెస్ట్ గిఫ్ట్గా ట్రైలర్ వచ్చే అవకాశాలున్నాయి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బ్యూటీ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. జనవరి 4న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుక చాలా ఘనంగా విజయవాడలో జరగనుంది. ఈ వేడుక కోసం చాలా సర్ప్రైజింగ్ ఈవెంట్స్ని ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని సినిమా నిర్మాత అయిన రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న మూవీనే కాకుండా, 150వ సినిమా కూడా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతికి సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది.
|