అక్కినేని అందగాడు అఖిల్ మొదటి సినిమా నిరాశపరచడంతో చాలా గ్యాప్ తీసుకుని ఈ మధ్యే రెండో సినిమా ప్రయత్నంలో బిజీ అయ్యాడు. చాలా మంది డైరెక్టర్స్ని పరిశీలించి, చివరికి 'మనం' సినిమా డైరెక్టర్ విక్రమ్ కుెమార్తో సినిమాకి ఓకే చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. బహుశా కొత్త సంవత్సరం జనవరిలో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లే అవకాశాలున్నాయి. మరో అఖిల్తో తొలి సినిమా చేసిన వినాయక్ ఇప్పుడు రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవితో సినిమా చేస్తున్నాడు.
అదే 'ఖైదీ నెంబర్ 150'. రామ్ చరణ్తో 'ధృవ' సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ని సొంతం చేసుకున్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డికి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. అల్లు అర్జున్తో 'రేసుగ్రుర్రం', చరణ్తో 'ధృవ' సూపర్ హిట్స్గా ఆయన ఖాతాలో ఉన్నాయి. ముచ్చటగా మూడో సినిమా చిరంజీవితో చేయాలని అనుకుంటున్నాడు కూడా. అయితే ఈలోగా సురేందర్ రెడ్డి అక్కినేని క్యాంప్లోకి అడుగుపెట్టనున్నాడని సమాచారమ్. అఖిల్ విక్రమ్ కుమార్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయబోతున్నాడట. తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్గా చూపించడం సురేందర్ రెడ్డి స్పెషాలిటీ. అందుకే అక్కినేని బుల్లోడు అఖిల్ని కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్క్రీన్పై చూడాలని నాగార్జున అనుకుంటున్నాడట. సో నెక్ట్స్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో యంగ్ హీరో అఖిల్ స్క్రీన్ మీదకొస్తాడా? లేక సీనియర్ హీరో చిరంజీవి స్క్రీన్ మీదికొస్తాడో చూడాలి.
|