ఈ సంక్రాంతికి రెండు పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అయ్యి, అంతకన్నా గ్రాండ్గా కలెక్షన్లు తెచ్చిపెట్టింది. అలాగే బాలయ్య వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా సంక్రాంతికి వచ్చిన అచ్చతెలుగు సినిమాగా సక్సెస్ బరిలో నిలిచింది. అలాగే మరో రెండు చిన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతి కి వచ్చి మంచి సక్సెస్ని పట్టుకెళ్లాయి. అవి శర్వానంద్ 'శతమానం భవతి', ఆర్ నారాయణ మూర్తి 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమాలు. అయితే ఇంతటితో ఈ విజయాల పరంపర ఆగిపోలేదు. ఈ ఏడాదికి ఈ సినిమాలు గ్రాండ్ వెల్కమ్ చెబితే, ఫిబ్రవరిలో కూడా సినిమాల జాతర రెడీగా ఉంది. ఈ నెల్లో రెండు పెద్ద సినిమాలు, రెండు చిన్న సినిమాలు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి.
ఈ పోటీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. నాగార్జున హీరోగా వస్తోన్న భక్తి రస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ', స్పోర్ట్ కాన్సెప్ట్తో వస్తోన్న వెంకీ 'గురు' వీటిలో పెద్ద సినిమాలు కాగా, యంగ్ హీరోలు రాజ్ తరుణ్, నాని కూడా ఈ పోటీలో ఉన్నారు. రాజ్ తరుణ్ హీరోగా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమా, నాని రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను లోకల్' సినిమాలు చాలా ఆశక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నాలుగు సినిమాలు నాలుగు వైవిధ్య కథా, కథనాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నాయి. సంక్రాంతికి మొదలైన సినిమా పండగ, ఈ సినిమాలతో ఫిబ్రవరిలో కూడా కొనసాగనుంది. ఈ పరిణామం సినీ ప్రేమికులకు అసలు సిసలైన పండగే అని చెప్పొచ్చు.
|