బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా విజయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ ఆనందంతో బాలయ్య తన పుత్రుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి పెదవి విప్పారు. అసలు ఆయన వందో చిత్రమే, మోక్షజ్ఞకు మొదటి చిత్రం అవుతుంది అని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. మళ్లీ ఓ మంచి చిత్రంతో త్వరలోనే మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనీ, అందుకు తగిన ఫుట్ వర్క్స్ జరుగుతున్నాయనీ బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు.
ఈ ఏడాది ఖచ్చితంగా యువరాజు ఎంట్రీ ఇస్తాడనీ బాలయ్య చెప్పారు. అయితే మోక్షజ్ఞ కోసం ఓ సినిమాని కూడా ఆయన రెడీ చేసి పెట్టారట. అదే బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీ అయిన 'ఆదిత్య 369'. ఈ సినిమాకు టైటిల్ని కూడా బాలయ్య ఫిక్స్ చేశారట. 'ఆదిత్య 999' టైటిల్తో ఈ సినిమా మోక్షజ్ఞ చేయబోతున్నాడనీ ఆయన తెలిపారు. మొత్తానికి బాలయ్య తనయుడి ఎంట్రీకి బాగానే ప్లాన్ చేశారు. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్ కూడా ఉండే అవకాశాలున్నాయట. ఇకపోతే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా విషయానికొస్తే ఈ సినిమాను తన వందో చిత్రంగా బాలయ్య ఎంచుకోవడమే పెద్ద సాహసం. అలాంటి సాహసం చేసి విజయం అందుకోవడం విశేషం. ఈ సినిమా క్లాస్ మాస్కి సంబంధం లేకుండా, కమర్షియల్ హంగుల మాట లేకుండా అన్ని వర్గాల వారినీ, అన్ని ప్రాంతాల వారినీ ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సెలవులు ముగిసినా కానీ, కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది.
|