నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ సూపర్ డూపర్ హిట్ని సొంతం చేసుకుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అక్కినేని ఫ్యామిలీ మూవీగా ఆడియన్స్లో ఎంతో ఫీల్ని క్రియేట్ చేసింది. అక్కినేని ఫ్యామిలీకి కూడా ఈ సినిమా ఓ మధుర జ్ఞాపకంగా నిలిచింది. తాజాగా నాగార్జున, నాగచైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్కి రెడీ అవుతున్నాడనీ సమాచారమ్. 'శతమానం భవతి' సినిమాతో ఈ ఏడాది తిరుగులేని సక్సెస్ని అందుకున్న సతీష్ వేగేశ్న ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారట. అక్కినేని తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి 'ప్రేమమ్'లో కూడా నటించారు. ఓ గెస్ట్ రోల్లో నాగ్ ప్రత్యక్షమవుతారు.
ఈ సినిమాలో. ఇప్పుడు చేయబోయే సినిమా వీరిద్దరికీ మూడో సినిమా అవుతుంది. అంతేకాదు ఈ సినిమాలో వీరిద్దరికీ ఈక్వెల్ వెయిట్ ఉన్న క్యారెక్టర్స్నే డిజైన్ చేస్తున్నారనీ సమాచారమ్. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని నాగ్ వెల్లడించనున్నారట. ప్రస్తుతం నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో పక్క నాగ చైతన్య గతేడాది 'ప్రేమమ్', సాహసం శ్వాసగా సాగిపో' సినిమాలతో విజయం అందుకున్నాడు. ఈ ఏడాది కళ్యాణ్ కృష్ణ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
|