శేఖర్ కమ్ముల సినిమాలన్నీ చాలా ప్లెజెంట్గా హాయిగా ఉంటాయి. అయితే చాలా కాలంగా శేఖర్ కమ్ములకు విజయం వరించడం లేదు. కానీ ఈ సారి శేఖర్ కమ్ముల కొట్టాడంతే. గట్టిగానే కొట్టాడు 'ఫిదా' సినిమాతో. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమాలో. లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మంచి టాక్తో రన్ అవుతోంది.
హిట్ నుండి సూపర్ డూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ క్రెడిట్ అంతా బ్యూటీ సాయి పల్లవి ఖాతాలోనే వేసేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. మొదట్లో అంతా వరుణ్ తేజ్, శేఖర్ కమ్ముల సినిమాగా అభివర్ణించినప్పటికీ, 'ఫిదా' సినిమా లేడీ ఓరియెంటెడ్ మూవీ అయిపోయింది. సాయి పల్లవి పర్ఫామెన్సే అందుకు కారణం. 'ప్రేమమ్'తో అమ్మడి టాలెంట్ అందరికీ తెలుసు. అయితే తెలుగులో అంత సీనుంటుందా సాయి పల్లవికి అనుకున్నారు. కానీ అంచనాలు తారుమారయిపోయాయి ఆమె యాక్టింగ్ టాలెంట్ ముందు. అచ్చమైన తెలంగాణా అమ్మాయిగా సాయి పల్లవి నటన ఎంతటి వారినైనా మెస్మరైజ్ చేయకుండా ఉండలేకపోతోంది.
ఇక ఓవర్సీస్లో అయితే ఈ సినిమా దూకుడు అలా ఇలా లేదు. కలెక్షన్ల పంట పండుతోంది. తెలంగాణా అమ్మాయి, అమెరికా అబ్బాయి లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి 'ఫిదా'తో ముద్దుగుమ్మ సాయి పల్లవి ఎట్ ఏ టైమ్ వరుణ్కి, శేఖర్ కమ్ములకి మర్చిపోలేని మంచి హిట్ని అందించిందనే చెప్పాలి.
|