మంచు విష్ణు హీరోగా 'కన్నప్ప' చిత్రం తెరకెక్కుతోందని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు ఇప్పుడు నిజమెంత అంటే.. ఖఛ్చితంగా నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'భక్త కన్నప్ప' చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆ సినిమాకి రీమేక్గా తెరకెక్కుతున్న చిత్రమే ఇప్పుడు విష్ణు హీరోగా రానున్న 'కన్నప్ప'. ఈ సినిమాని విష్ణు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాడట.
ఎక్కవ ఫోకస్ పెడుతున్నాడనీ సమాచారమ్. అంతేకాదు ఈ సినిమా కోసం వ్యత్యించే బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాలా 70 నుండి 80 కోట్ల పై చిలుకేనట. అయితే మంచు విష్ణుపై అంత రిస్క్ అవసరమా? అంటే కథలో బలం, కథనంలోని నమ్మకం అంత బడ్జెట్ని వ్యత్యించేలా చేస్తున్నాయట. ఈ సినిమా కోసం ప్రముఖ రచయిత, నటుడు తణికెళ్ల భరణి కథని సిద్ధం చేశారట. ఈ ఏడాదే ఈ సినిమాని పట్టాలెక్కించే ఉద్దేశ్యంలో చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ని తీసుకొస్తారట. అచ్చమైన తెలుగు కథనంతో సాగే చిత్రమిది. అయితే హాలీవుడ్ డైరెక్టర్ ఎందుకా అంటే, అది సినిమాలో విషయాన్ని బట్టి అర్ధమవుతుంది. రిస్కే అని తెలిసినా కానీ ఈ సినిమా విషయంలో ఏదో తెలీని ధైర్యం మమ్మల్ని ఫోర్స్ చేస్తోంది అంటూ మంచు విష్ణు అనడం ఆశక్తిని కలిగిస్తోంది. మరో పక్క మోహన్బాబు కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్గా ఉన్నారనీ తెలుస్తోంది. ప్రస్తుతం మంచు విష్ణు నటిస్తున్న 'ఆచారి అమెరికా యాత్ర' సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రగ్యా జైశ్వాల్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.
|