'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ తొలి సినిమాకే యాక్టింగ్ టాలెంటెడ్ అనిపించుకోవడంతో పాటు మంచి సక్సెస్నీ తన ఖాతాలో వేసుకుంది. తర్వాతి సినిమా 'నేను లోకల్'తో మరో హిట్ని తన ఖాతాలో వేసుకుంది. తొలి సారిగా ఈ ముద్దుగుమ్మ చేసిన రెండు సినిమాలూ 'నేను' అనే టైటిల్తోనే తెరకెక్కడం మంచి విజయాలు అందుకోవడం జరిగింది. ఇక లైఫ్ టైమ్ అచీవ్మెంట్గా కీర్తికి దక్కిన ఆఫర్ 'మహానటి' సినిమా. ఈ ఒక్క సినిమాతో కీర్తి సురేష్ స్టార్ అయిపోయింది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఆమె కెరీర్లోనే బెస్ట్ సక్సెస్గా నిలిచింది.
సినిమా సక్సెస్ అవ్వడం ఓ ఎత్తయితే, నటిగా ఈ సినిమాతో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగింది కీర్తి సురేష్. అసలీ సినిమాతో ఇంత సక్సెస్ వస్తుందని ఆమె కూడా ఊహించి ఉండదు. అంతగా ఈ సినిమాకి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఆ కాలం నాటి చరిత్ర అయినప్పటికీ, నేటి తరం యువత కూడా ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పంట పండిస్తోందందుకే ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి క్రేజ్ వచ్చిందంటే, కీర్తిసురేష్ లక్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి, విజయవంతంగా ముందెకెళ్తోంది. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. సమంత, దుల్కర్సల్మాన్, విజయ్ దేవరకొండ, మోహన్బాబు, నాగ చైతన్య తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలు పోషించారు.
|