పంచతంత్రం - పడిపోయిన తాబేలు - రవిశంకర్ అవధానం

Panchatantram - padipoyina tabelu

పంచతంత్ర కథలు కేవలం పిల్లలకు నీతులు నేర్పడానికే కాదు, జీవితంలో ఎంతో అనుభవం సంపాదించిన పెద్దలకు కూడా ఎన్నో విషయాలు నేర్పుతాయి. దాదాపు 3000 సంవత్సరాల క్రితం రాసిన ఈ కథలు ఇప్పటికీ ఎంతో ఆచరణాత్మకంగా ఉన్నాయి. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా అతిగా మాట్లాడటం వల్ల ఎంత ప్రమాదమో, నోరు అదుపులో పెట్టుకోవడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం.

ఒక సరస్సులో కంబుగ్రీవ అనే తాబేలు ఉండేది. దానికి రెండు హంసలు మంచి స్నేహితులు. ఎప్పుడూ మూడు సరస్సు ఒడ్డున కలుసుకుని కబుర్లు చెప్పుకునేవి. ఒకసారి తీవ్రమైన కరువు వచ్చింది, సరస్సు నీరు ఎండిపోవడం మొదలు పెట్టింది. నీటి మట్టం తగ్గిపోవడంతో హంసలు ఆందోళన చెందాయి. "ఈ సరస్సులో నువ్వు బతకలేవు. నీరంతా ఎండిపోతుంది" అని అవి తాబేలుతో చెప్పాయి. తాబేలుకు కూడా సమస్య అర్థమైంది, "ఇక్కడ ఉండటం కష్టమే. మిత్రులారా, నీటితో నిండిన మరో సరస్సు కోసం వెతకండి, తర్వాత ఒక బలమైన పుల్లను తీసుకురండి" అని కోరింది. "పుల్ల దొరికిన తర్వాత, నన్ను ఆ పుల్లతో తీసుకువెళ్లండి. నేను నోటితో గట్టిగా పుల్లను పట్టుకుంటాను, మీరు ఇద్దరూ పుల్ల రెండు చివరలను పట్టుకుని ఎగరండి" అని తాబేలు చెప్పింది.

ప్రణాళిక హంసలు ఎక్కడెక్కడో ఎగిరి వెళ్ళి, నీటితో నిండిన సరస్సును కనుగొన్నాయి. తాబేలును తీసుకువెళ్లడానికి తిరిగి వచ్చాయి. అవి పుల్ల రెండు చివరలను పట్టుకోవడానికి సిద్ధమై, తాబేలుకు సూచించాయి, "ప్రియమైన మిత్రమా, అంతా బాగుంది. కానీ నోరు గట్టిగా మూసి ఉంచు. నువ్వు మాట్లాడితే పడిపోతావు" అని హెచ్చరించాయి. తాబేలు ఒప్పుకుంది. చివరకు, అవి ఎగరడం ప్రారంభించాయి. కొంచెం దూరం ఎగిరిన తర్వాత, క్రింద ఒక పట్టణం కనిపించింది. తాబేలును పుల్లతో మోసుకెళ్తున్న హంసలను చూసి పట్టణ ప్రజలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు కేకలు వేసి, అభినందనలు పలికారు. "చూడండి! రెండు పక్షులు పుల్ల సాయంతో తాబేలును మోసుకెళ్తున్నాయి" అని అరవడం ప్రారంభించారు.

ఆ సందడి విని, తాబేలు నోరు తెరిచింది. "ఏంటీ అంతా సందడి!" అని అది అడిగింది. నోరు తెరిచిన వెంటనే అది క్రింద పడిపోయింది, దాన్ని ఆపడానికి హంసలు ఏమీ చేయలేకపోయాయి. అది క్రింద పడగానే, పట్టణ ప్రజలు దాన్ని పట్టుకుని విందు చేసుకున్నారు.

నీతిశాస్త్రం
ఈ కథలోని నీతి ఏమిటంటే - ఇతరుల మంచి సలహాలను వినాలి. అనవసరంగా మాట్లాడటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. నోరు అదుపులో పెట్టుకోవడం ముఖ్యం.

కార్పొరేట్ ప్రపంచంలో ఈ నీతి ఎంత ముఖ్యం?

  • సలహాలను వినడం: ఆఫీసులో సీనియర్ల, అనుభవం ఉన్న వారి సలహాలను వినడం చాలా ముఖ్యం. వారు మనకు మంచి దారి చూపించగలరు.
  • అనవసరంగా మాట్లాడటం: ఆఫీసులో కొన్ని విషయాల గురించి అతిగా మాట్లాడటం, గోప్యత పాటించకపోవడం ప్రమాదకరం. ఇది ఉద్యోగ భద్రతకే ముప్పు తీసుకురావచ్చు.
  • బాస్ ముందు జాగ్రత్త: పై అధికారుల ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు వారికి నచ్చకపోవచ్చు.
  • నిదానం అవసరం: తొందరపడి మాట్లాడటం కన్నా, ఆలోచించి మాట్లాడటం చాలా ముఖ్యం.


వ్యక్తిగత జీవితంలో ఒక ఉదాహరణ:
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు ఏదైనా విషయంలో సలహా ఇచ్చినప్పుడు, వాళ్ళ మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే, చివరికి సమస్యలు వస్తాయి. అలాగే, కోపంలో లేదా ఆనందంలో ఏది పడితే అది మాట్లాడితే, అది మనకే నష్టం కలిగించవచ్చు.

ఆ పాపం తాబేలు, హంసల సలహా వినకుండా నోరు తెరిచి, క్రింద పడి, ప్రజలకు విందు అయిపోయింది. ఈరోజుల్లో ఆఫీసులో కూడా చాలామంది 'తాబేలు' లాగే ఉంటారు. ఎవరో ఏదో అన్నారని, లేదా ఏదైనా చూసి ఆగలేక, అనవసరంగా మాట్లాడి, తమ పరుపును... సారీ, తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. కాబట్టి, ఆఫీసులో అయినా, జీవితంలో అయినా... నోరు అదుపులో పెట్టుకోవడం ముఖ్యం. లేకపోతే... పుల్ల నుంచి పడిపోయిన తాబేలు గతే పట్టే అవకాశం ఉందికాదా !

మరిన్ని వ్యాసాలు

Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్