కార్టూనిస్టు మిత్రులకు నమస్కారం..!
ఆంధ్ర ప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం ('ఆకాసం') పనులు 6.9.2025 న మొదలు పెట్టి కార్యవర్గ సభ్యులు మరియు మన కార్టూనిస్ట్ మిత్రుల సహాయ సహకారం తో ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ఫైనల్ గా 14.12.2025 ఆదివారం ఉదయం 11 గంటలకు మన సభ జరుపడానికి అన్ని ఏర్పాట్లు మన స్థానిక సభ్యులు చేస్తున్నారు.
ఈ సభకు ముఖ్య అతిధిగా శ్రీ రఘు రామ కృష్ణ రాజు గారు (ఉండి శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్), విశిష్ట అతిథిగా జస్టిస్ శ్రీ ఎ. వి, సాయి గారు (యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్ హైకోర్టు అఫ్ ఆంధ్రప్రదేశ్), ఆత్మీయ అతిథిగా శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు (గౌరవ అధ్యక్షులు, ఆకాసం) విచ్చేస్తున్నారు.
కనుక మనందరం ఆ రోజున జరిగే సభ కు హాజరై సభ ను జయప్రదం చేయాలని నిర్వాహక కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.
సభ కు విచేయుచున్న కార్టూనిస్టులకు వసతి అవసరం ఉన్నచో ముందుగా తెలియజేసిన వారికి హోటల్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాము... తెలియజేయండి.
సభా వేదిక
బాలోత్సవ భవన్,
బందర్ రోడ్,
రాఘవయ్య పార్క్ ఎదురుగా,
విజయవాడ
సభా సమయం
14.12.2025, ఆదివారం
ఉదయం 11 గంటలకు
ఇతర వివరాలకు కమిటీ సభ్యులను ఫోన్ ద్వారా సంప్రదించగలరు....

