కమల్ హాసన్ కధానాయకుడిగా తెరకెక్కుతున్న 'చీకటి రాజ్యం' విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్కమల్ ఇంటర్ నేషనల్ పతాకంపై చంద్రహాసన్ నిర్మించిన ఈ చిత్రంలో స్మైలింగ్ బ్యూటీ త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కిడ్నాపైన కొడుకు కోసం పోరాడే తల్లితండ్రుల ఇతివృత్తమే ఈ 'చీకటి రాజ్యం'. దర్శకుడు ఈ సినిమాను సస్పెన్స్ ధ్రిల్లర్ నేపధ్యంలో చక్కగా తెరకెక్కించాడు. యూనివర్సల్ హీరో అయిన కమల్ కెరీర్లో ఈ సినిమా మరో గొప్ప విజయం కానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అలనాటి హీారోయిన్, కమల్ సతీమణి అయిన గౌతమి ఈ సినిమాకు కాస్టూమ్స్ డిజైనర్గా పని చేస్తోంది.
నటి త్రిషకు ఈ చిత్రం 50 వ చిత్రం కావడం విశేషం. అంతేకాదు కమల్ హాసన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసిన రాజేష్ సెల్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తమిళంలో ఈ చిత్రం 'తూంగావనం' గా విడుదల కానుంది. కేవలం తెలుగు, తమిళ్ ప్రేక్షకులే కాకుండా ఖచ్చితంగా 17 కోట్ల మంది భారతీయులు చూసి, మెచ్చుకోదగ్గ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని కమల్ తెలిపారు. బుధవారం చెన్నైలో రిలీజైన సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.
|