సెలబ్రిటీలకీ రెస్టారెంట్ బిజినెస్లకీ ఏదో అవినాభావ సంబంధం వున్నట్టుంది. క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు కూడా రెస్టారెంట్ బిజినెస్లపై ఆసక్తి చూపుతారు. సినీ ప్రముఖులూ ఇందుకు మినహాయింపు కాదు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఈ ట్రెండ్ నడుస్తోంది.
టాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కూచిపూడి వెంకట్ హైద్రాబాద్లో స్థాపించిన ఉలవచారు రెస్టారెంట్ తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ సుపరిచితమైపోయింది. ఆ రెస్టారెంట్లో కొన్ని ఐటమ్స్కి తెలుగు సినీ ప్రముఖులు ఫిదా అయిపోయారు. జిహ్వచాపల్యం ఎక్కువ వున్న మామూలు వారికీ ఈ రెస్టారెంట్ ఫేవరెట్గా మారిపోయింది.
తెలుగు హీరో శర్వానంద్ కూడా ఓ రెస్టారెంట్ స్థాపించాడు. 'బీన్జ్' దాని పేరు. అయితే దాన్ని సరిగ్గా పాపులర్ చేయలేకపోయాడు శర్వానంద్. రెస్టారెంట్ బిజినెస్ చేయాలంటే దానికి పెద్ద ప్లానింగ్ కావాలి. కూచిపూడి వెంకట్లో ఆ ప్లానింగ్ వుంది. శర్వానంద్లో అది లోపించింది. ఎన్ని బిజినెస్లు వున్నా, రెస్టారెంట్ బిజినెస్ ఇచ్చే కిక్కే వేరు.. అంటారు. రెస్టారెంట్స్కి వున్న క్రేజ్ అలాంటిది.
|