ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్లో నటిస్తోన్న సినిమా 'జై లవకుశ'. భారీ అంచనాలున్నాయి 'జై లవ కుశ' సినిమాపైన. తమ్ముడు ఎన్టీయార్తో, అన్నయ్య కళ్యాణ్రామ్ తొలి సారిగా నిర్మిస్తున్న సినిమా ఇది. అందుకే నిర్మాణం పరంగా ఎక్కడా రాజీ పడటంలేదు. అయినా, నిర్మాణమంటే కళ్యాణ్రామ్కి కొత్త ఊపు వచ్చేస్తుంటుంది. భారీ బడ్జెట్తో రిస్క్ చేయడానికి ఎప్పుడూ వెనుకాడలేదాయన. కొత్త దర్శకులతోనే భారీ బడ్జెట్తో సినిమాలు తీసిన ట్రాక్ రికార్డ్ కళ్యాణ్రామ్కుంది. అలాంటిది బాబీ దర్శకత్వంలో, వరుస సక్సెస్ల మీద దూసుకెళ్తోన్న ఎన్టీయార్ హీరోగా 'జై లవ కుశ' సినిమా తీస్తున్న కళ్యాణ్రామ్, బడ్జెట్ విషయంలో రాజీ పడతాడా? ఛాన్సే లేదు.
ఇంకో వైపున సినిమాకి ప్రీ రిలీజ్ హైప్ కూడా అంచనాలకు మించి క్రియేట్ అయ్యింది. టీజర్తో ఆ హైప్ పదింతలు పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. అన్ని ఏరియాల నుంచీ ప్రీ రిలీజ్ బిజినెస్ బీభత్సంగా జరిగినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో నెగిటివ్ ఛాయలున్న 'జై' పాత్రతో కూడిన టీజర్ ఇప్పటికే బయటికి వచ్చేసింది. సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. త్వరలోనే 'లవ', 'కుశ' గెటప్స్ కూడా రిలీజ్ కానున్నాయి. ఫస్ట్ గెటప్కిే వచ్చిన రెస్పాన్స్తోనే ఇంత హైప్ క్రియేట్ కాగా, ఇక మిగిలిన రెండు లుక్స్ ఇంకే రేంజ్లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో ఊహించడమే కష్టంగా ఉంది. రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
|