సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ మూవీ '2.0' రిలీజ్కి సిద్ధమైంది. ఈ నెల 29న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యూనివర్సల్ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇంతవరకూ వాయిదాల పర్వం కొనసాగిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంత కాలం నుండో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడేకొద్దీ ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఈ విషయం పక్కన పెడితే, సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో ఈ స్పెషల్ స్క్రీనింగ్స్ సిద్ధం చేస్తున్నారట.
గతంలో 'కబాలి' సినిమా విషయంలో ఎయిర్ ఇండియా విమానంపై పోస్టర్ డిజైన్ చేయించి ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు అంతకు మించిన గ్రాండియర్ని 'రోబో 2.0' ప్రమోషన్స్లో చూడబోతున్నామట. అలాగే గతంలో మాదిరి సాఫ్ట్వేర్ కంపెనీలు సెలవు ప్రకటించే అవకాశాలున్నాయి. ఉద్యోగుల నుండి సెలవు కోసం డిమాండ్స్ పెరుగుతున్నాయి. మరోపక్క చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్న పోస్టర్స్, ప్రోమోస్ సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాల్ని రెట్టింపు చేస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ దాదాపు 150 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఆ రకంగా ఆల్రెడీ రికార్డు సృష్టించేసింది 'రోబో 2.0'. అందాల భామ అమీజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో '2.0' రూపొందుతోంది.
|