టాలీవుడ్కి వచ్చిన మరో బెంగళూరు భామ పూజా హెగ్దే. ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించిన పూజా, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్తో ‘ముకుంద’ సినిమాలో నటిస్తోంది. ‘ఒక లైలా కోసం’ సినిమా విడుదల కాకముందే ఆమెకు తెలుగు సినిమాల్లో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ల కొరత ఉంది కొన్నాళ్ళ నుంచి. ఆ కొరతను తీర్చేందుకు బ్యూటీస్ ఒకరొకరుగా టాలీవుడ్లో ల్యాండ్ అవుతున్నారు. అలా బెంగళూరు నుంచి హైద్రాబాద్లో ల్యాండ్ అయ్యింది పూజా హెగ్దే.నటిగా తొలి సినిమాతోనే పూజా హెగ్దేకి మంచి మార్కులు పడ్తాయని ‘ఒక లైలా కోసం’ ట్రెయిలర్ రాగానే అనుకున్నారు. అందుకే ఆమెకు అవకాశాలూ వరుసగా వస్తున్నాయి. గ్లామర్తోపాటూ నటనలోనూ తగిన శిక్షణ తీసుకుని వస్తున్న అందాల భామలకి డిమాండ్ పెరగడం సహజమే.
తెలుగు సినీ పరిశ్రమకి తలెత్తిన హీరోయిన్ల లోటును కొంతవరకు పూజా హెగ్దే తీర్చగలదంటున్నారు పరిశీలకులు. వస్తూనే రెండు పెద్ద సినీ కుటుంబాల వారసుల సరసన నటిస్తుండడం పూజాకి పెద్ద ప్లస్ పాయింట్. నాగచైతన్యతో చేసిన ‘ఒక లైలా కోసం’, వరుణ్తో చేస్తున్న ‘ముకుంద’ సినిమాలు హిట్టయితే పూజా హెగ్దే గోల్డెన్ లెగ్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగులో డిమాండ్ బాగా ఉన్న లేటెస్ట్ హీరోయిన్స్లో రకుల్ ప్రీత్సింగ్ ఫస్ట్ ప్లేస్లో వుంటే, ఆ తర్వాతి ప్లేస్ పూజా హెగ్దేదే.
|