తారక్ రత్న హీరోగా వెంకటరమణ సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఎవరు'. ఒక డిఫరెంట్ కథా, కథనంతో తెరక్కెబోతోంది ఈ చిత్రం. యామిని, శేఖర్, చందు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ప్రేక్షకులకు తప్పకుండా ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుందంటున్నారు చిత్ర బృందం. గతంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ మూవీగా తెరకెక్కిన 'అమరావతి' సినిమా తారక్ రత్నకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం తారక రత్న కెరీర్ కాస్త స్లోగానే ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు తారక రత్న.
తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో తారక రత్న కొత్తగా కనిపిస్తాడట. జర్నలిస్ట్ పాత్రలో తన నటనలోని మరో కోణాన్ని ఈ సినిమాతో బయటకు తీయబోతున్నాడు ఈ నందమూరి కుర్రాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ సినిమాలకి తెలుగులో ఈ మధ్య ఆదరణ బాగా ఉంది. థ్రిల్లర్కి కామెడీ జోడించి పెద్ద పెద్ద హిట్స్ సొంతం చేసుకుంటున్నారు చాలామంది యంగ్స్టర్స్. తారకరత్నకీ అలాంటి హిట్ వస్తుందా? చూడాలిక.
|